margadarsi branch manager after court denied for his remand
Telecast Date: 21-08-2023 Category: Political Publisher:  SevenTV

 

ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు ఆధ్వర్యంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు కోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆదేశాలో మార్గదర్శికి చెందిన ఓ బ్రాంచి మేనేజర్ ను పోలీసులు విడుదల చేశారు. రాజమండ్రి మార్గదర్శి బ్రాంచి మేనేజర్ రవిశంకర్ పై పెట్టిన కేసులో జిల్లా కోర్టు జడ్జి గంధం సునీత రిమాండ్ కు తిరస్కరించారు.


గతంలోనూ ఇదే సెక్షన్ పై అరెస్ట్ చేశారని, నిందితుడి రిమాండ్ పూర్తయిందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత కేసులో ఇప్పటివరకు చార్జిషీటు దాఖలు చేయలేదని తెలిపారు. ఇప్పుడు కూడా అవే సెక్షన్లతో కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. 

 

అటు, ఏపీ హైకోర్టు కూడా మార్గదర్శికి సాంత్వన కలిగే సూచన చేసింది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి బ్రాంచిల్లో సోదాలు చేయవద్దని ఏపీ సీఐడీకి స్పష్టం చేసింది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading